టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్ ","ఆచార్య " సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలు తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15 వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక శంకర్ తో సినిమా అనగానే మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి.. శంకర్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ కోరిక తీరలేదు. ఫ్యూచర్ లో వీరి కాంబో సెట్ అవుతుందో లేదో డౌటే. కానీ రామ్ చరణ్ కి ఛాన్స్ రావడంతో అందరూ సంతోషించారు. అయితే ఇప్పుడు చరణ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని తప్పు చేశాడా..? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. దానికి కారణం శంకర్ అనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమా పట్ల రామ్ చరణ్ కి దిల్ రాజుకి ఆసక్తి బాగానే వుంది కాని శంకర్ మాత్రం పెద్ద ఆసక్తి చూపించట్లేదు. అసలు నిజం చెప్పాలంటే కథ ఏంటో తెలీకుండానే ఈ సినిమాని దిల్ రాజు సెట్ చేశాడట.


ఇక 'ఇండియన్2' నిర్మాతలతో ఏర్పడిన విబేధాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అలానే 'అపరిచితుడు' రీమేక్ పై కూడా ఇష్యూ నడుస్తుంది.ఇప్పుడు 'ఇండియన్ 2' సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదనే ఒప్పందంతో ఉన్నాడు శంకర్. అంతకుమించి ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు. ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో 'ఇండియన్ 2' షూటింగ్ పునః ప్రారంభించనున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా కోసం పని చేసే టెక్నీషియన్స్ విదేశాల నుండి రావాలి.వర్క్ పూర్తవ్వాలి అంటే చాలా సమయం పట్టేలా ఉంది. పైగా నిర్మాతలతో శంకర్ కి సఖ్యత లేకపోవడంతో సినిమా వాయిదాలు పడే ఛాన్స్ ఉంది. ఇది పూర్తి చేసిన తరువాత కానీ శంకర్ సినిమాను మొదలుపెట్టలేని పరిస్థితి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శంకర్ రన్వీర్ సింగ్ తో 'అపరిచితుడు' రీమేక్ చెయ్యాలని ఆసక్తిగా వున్నాడట. దాని మీద వున్న ఆసక్తి RC15 పై శంకర్ పెట్టట్లేదట. అందుకే రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: