దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.  ప్రముఖ సినీ నటుడు, లాక్ డౌన్ లో రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. నిన్న ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. అంతే కాక కరోనా కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళుతున్నానని ప్రకటించారు కూడా.  

తన మూడ్ బాగుందని పేర్కొన్న ఆయన నిన్న ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, దీంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లానని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన ఈ గ్యాప్ మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన సమయాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే సోనూకు కరోనా సోకడంతో ఆచార్య యూనిట్ లో టెన్షన్ నెలకొందని అంటున్నారు. సోనూకి కోరోనా సోక‌డంతో.. ఆచార్య టీమ్ ఎలెర్ట్ అయ్యి ఆచార్య‌ యూనిట్ లోని మిగిలిన స‌భ్యులంతా ఇప్పుడు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. 

వారిలో ఎక్కువ మందికి సోకినట్లు అయితే షూట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆచార్య లో సోనూ ఓ కీల‌క మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా కోస‌మే ఆయ‌న హైద‌రాబాద్ లో ఉంటున్నారు. నిజానికి గురువారం షూటింగ్ పూర్తి అయ్యాక కరోనా టెస్ట్ చేయించుకున్న సోనూకి నెగిటివ్ అని వచ్చింది. దీంతో శుక్రవారం ముంబై వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళాక చేయించుకున్న పరీక్షలో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. ఆచార్యలో సోనూ సూద్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. మహా అయితే ఒకటి రెండు రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: