గత సంవత్సరం  కరోనా వ్యాధి విజృంభించడంతో ప్రజలు ఎంతో భయాందోళనలకు గురయ్యారు. అయితే మొదటి వేవ్ లో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండి కోలుకునే వారి సంఖ్య అధికంగా ఉండేది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు కరోనా బారినపడే వారి సంఖ్య అధికమవడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.ఈ విధంగా కేసుల పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఏమాత్రం జాగ్రత్త పడకుండా ఎంతో నిర్లక్ష్యం వహించడం వల్లే కరోనా కేసులు అధికమవుతున్నాయి.
 రోజులు గడిచేకొద్దీ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ 19 సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.         



ఈ వైరస్ కారణంగా చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో  కొంతమంది సెలబ్రిటీల కి కరోనా సోకిన విషయం అందరికి తెలిసిందే.  అయితే ఇదే నేపథ్యంలో టాలీవుడ్ లోని కొన్ని అతిపెద్ద చిత్రాల రిలీజ్ లు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే వాయిదాలు తెలిసిన వ్యవహారమే. తాజా సమాచారం మేరకు.. గత కొద్ది రోజులుగా చాలా చిన్న మధ్యస్థ బడ్జెట్ సినిమాల చిత్రీకరణలు ఆపేసారని తెలిసింది.సెకండ్ వేవ్ కారణంగా పరిశ్రమ మరోసారి కొద్దిరోజుల పాటు స్థంబిస్తుందని కథనాలొస్తున్నాయి.



అయితే ఎఫ్ 3 ఆర్ఆర్ఆర్,ఆచార్య వంటి పెద్ద సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. చిత్రీకరణలు వేగంగా పూర్తి చేస్తున్న ఇలాంటి సమయంలో కరోనా ఇబ్బందికరంగా మారింది. అయితే అగ్ర కథానాయకులు ఎంతో ధైర్యంగా సెట్స్ కి వెళుతున్నారు. దర్శకనిర్మాతలకు సహకరించడం పాజిటివ్ అంశంగా మారుతోంది. చూస్తున్న కొద్దీ కరోనాతో సహజీవనాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.అయితే ముందు ముందు సన్నివేశం ఎలా మారనుందో వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఎలాంటి విపత్కర సంఘటనలు  ఎదురవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: