ప్రముఖ నటుడు వివేక్ వివేక్ శనివారం గుండె పాటుతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణం అభిమానులకు తీరని లోటుగా మారింది. వివేక్ దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించారు. ఆయన నటించిన చాలా సినిమాలు కేవలం ఆయన వల్ల కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని స్టార్ హీరోలతో సమానంగా వివేక్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక తెలుగులో కూడా మంచి క్రేజ్ ని ఫ్యాన్స్ ని సమోదించుకున్నారు వివేక్."అపరిచితుడు", "శివాజీ","రఘువరన్ బీటెక్ " సినిమాలలో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేంద్రం నుంచి ఆయన పద్మశ్రీ పురస్కారం కూడా అందుకోవడం జరిగింది.ఆయన ఇకలేరనే వార్త తెలుసుకొన్న సినీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద ఉంచిన వివేక్ భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించారు.


వివేక్ పార్థీవ దేహాన్ని కడసారి దర్శించుకొన్న తమిళ ప్రముఖుల్లో శరత్ కుమార్, విక్రమ్, డైరెక్టర్ శంకర్, అర్జున్, సిద్దార్థ్, సూర్య, జ్యోతిక, కార్తీ, త్రిష తదితరులు ఉన్నారు. ఓ దశలో సిద్దార్థ్, త్రిష, కీర్తీ సురేష్ కంటతడి పెట్టుకొని శ్రద్దాంజలి ఘటించారు. భారీగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు.ఇక ముఖ్యంగా సిద్ధార్ద్ అయితే ఆయన్ను చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేక కన్నీరు మున్నిరయ్యి బోరున ఏడ్చాడు.వివేక్ కి సిద్ధార్థ్ కి మంచి అనుబంధం వుంది.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో శంకర్ డైరెక్షన్ లో 'బాయ్స్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వివేక్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక వివేక్ చనిపోవడం జీర్ణించుకోలేక సిద్ధార్థ్ బోరున ఏడ్చేసాడు.ఇక ఆయన ఆత్మకి శాంతి చీకూరి ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని మనసారా కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి: