ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కించిన అరవింద సమేత సినిమా ద్వారా భారీ సక్సెస్ అందుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కి త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్, స్టోరీ, స్క్రిప్ట్ కి మంచి పేరు వచ్చింది. ఇక దాని అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అలవైకుంఠపురములో. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా అత్యంత భారీ విజయం అందుకోవడం తోపాటు ఇందులోని సాంగ్స్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయి దర్శకుడిగా త్రివిక్రమ్ కి మరింత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
అయితే ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. ఇక కొద్ది రోజుల నుంచి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్నారని, మంచి స్టైలిష్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా యొక్క స్టోరీ అద్భుతంగా సిద్ధం చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం తన బృందంతో కలిసి దాని పూర్తి స్క్రిప్టు పై కసరత్తు చేస్తున్నారని మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క అధికారిక అనౌన్స్ మెంట్ రానుంది అని అంటున్నారు.

అలానే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నారని ఇప్పటికే ఆ మూవీ ఒక స్టోరీ కూడా రెడీ చేసే పనిలో పడ్డారట త్రివిక్రమ్. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆ సినిమాను మొదలు పెట్టనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు నిజమే అయితే అతి త్వరలో సూపర్ స్టార్ తో పాటు పవర్ స్టార్ ల కలయికలో త్రివిక్రమ్ నుండి రెండు అద్భుతమైన సినిమాలు ఆశించవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: