రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలు అత్యద్బుత విజయాల తర్వాత సౌత్ సినిమా యొక్క రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పక తప్పదు. ఆ తర్వాత నుంచి పలు సౌత్ భాషల్లో ఒక్కొక్కటిగా పాన్ ఇండియా సినిమాల రాక మొదలవడం అవి మంచి విజయాలు అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం దాదాపుగా ఐదుకు పైగా టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలానే వాటి పై దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉండటం విశేషం.

మరోవైపు ఇతర స్టార్ హీరోలు కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల పై ఆసక్తి చూపుతున్నట్లు తెల్సుతోంది. దానికి కారణం ఆ సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ కనుక సాధించినట్లయితే ఏకకాలంలో ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ తోపాటు ఫాలోయింగ్, క్రేజ్ దక్కించుకోవచ్చనేది వారి ఆలోచన. మరోవైపు ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న ప్రభాస్ అతి త్వరలో వార్ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ లో ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్లు సమాచారం.

అలానే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆపై కరణ్ జోహార్ నిర్మాణంలో ఒక బడా బాలీవుడ్ మూవీ చేయనున్నారని ఆయన తోపాటు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా రాబోయే మరికొద్దిరోజుల్లో రోహిత్ శెట్టి, సంజయ్ లీలా భన్సాలీ వంటి బాలీవుడ్ దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ హీరోలతో సదరు బాలీవుడ్ దర్శకులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మన టాలీవుడ్ హీరోలు కొందరు బాలీవుడ్ తెరపై కనిపించే అవకాశం గట్టిగా కనపడుతోందని చెబుతున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త నిజమే అయితే మన టాలీవుడ్ హీరోల అభిమానుల పంట పండినట్లే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: