జనసేన పార్టీ అధినేత, నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. పవన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో తన ఫామ్ హౌస్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. దీంతో ఆయన అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఓ అభిమాని.. పవన్ కళ్యాణ్‌ను స్వామి వివేకానంద, చే గువేరా పరామర్శించడానికి వచ్చినట్లుగా ఆ ఫోటోని మార్ఫింగ్ చేశాడు..


అసలే కోపంతో ఊగిపోతున్న ఫ్యాన్స్.. ఈ ఫోటోను చూడగానే సివాల్ ఎత్తిపోయారు..ఈ ఫోటో పెట్టిన వెంటనే పెద్ద ఎత్తున షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని స్పందించారు ఫోటోని షేర్ చేసిన ఆయన ఈ ఫోటో కార్టూన్ ఉందని సెటైర్ వేశారు. దీంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకోసారి తమ హీరో గురించి ఇలాంటి పోస్ట్ పెడితే సహించేది లేదని హెచ్చరించారు.


ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇంతటితో ఆగని పవన్ ఫ్యాన్స్ మెగా బ్రదర్ నాగబాబు కు షేర్ చేశారు.దీనిపై నాగబాబు స్పందిస్తూ.. బాబు గోగినేనిపై కౌంటర్ వేశారు. 'నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా.. నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటేనే ఇష్టం.. బాబు గోగినేని అంటే కాదు' అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. నాగబాబు కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ వైరల్ గా మారింది.. బాబు గోగినేని కుక్క కన్నా హీనం అని నాగబాబు అభిప్రాయం. ఈ విషయాన్ని గ్రహించిన మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ ఆరోగ్యం పై ఆర్జీవీ, శ్రీ రెడ్డి కామెంట్స్ చేసారు. ఇప్పుడు బాబు గోగినేని కూడా చేయడంతో నిరాశలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: