బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గత సంవత్సరం కరోనా పరిస్థితులు ప్రారంభం అయిన తరువాత వరస కార్మీకులకు అతడు చేసిన సహాయ సహకారాలతో సోనూ సూద్ ఒక్కరోజులో జాతీయ స్థాయిలో మానవతా వాదిగా మారిపోవడమే కాకుండా ఏకంగా అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ సోనూ సూద్ పై ప్రత్యేక కథనం వ్రాసే స్థాయికి ఎదిగి పోయాడు. తాను చేసిన సేవా కార్యక్రమాల కోసం తన సొంత ఆస్థులను కూడ తాకట్టు పెట్టడంతో సోనూ సూద్ ఖ్యాతి మరింత పెరిగి పోయింది.


ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తూ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. ప్రస్తుతం చరణ్ సోనూ సూద్ లపై ఒక భారీ యాక్షన్ ఫైటింగ్ సీన్ ను కొరటాల చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో సోనూ సూద్ సెల్ ఫోన్ కు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది నుండి మెసేజ్ లు వస్తున్నాయట. ఆ మెసేజ్ ల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడంతో సోనూ సూద్ సెల్ ఫోన్ బ్లాక్ అయిపోయిందట.


ఒకేసారి వేల సంఖ్యలో వస్తున్న ఆ మెసేజ్ లను చూసి సోనూ సూద్ షాక్ అయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో ఎక్కడా హాస్పటల్స్ లో బెడ్స్ మందులు ఆక్సిజన్ కు విపరీతమైన కొరత ఏర్పడిది. దీనితో తమను ఆదుకోండి అంటూ సోనూ సూద్ కు వస్తున్న మెసేజ్ లు చూసి అంతమందికి తాను సహాయం చేయలేక ఒకవేళ చేద్దామని ప్రయత్నించినా తన మాటకు విలువలేదు అన్నవిషయం తెలుసుకుని తెగ మధన పడుతున్నాడట.


ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేస్తూ ప్రస్తుతం ప్రజలు పడుతున్న బాధలు అన్నీ తీర్చే శక్తి తనకు లేకపోవడంతో తనకు బాధగా ఉంది అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులలో ఎవరో వచ్చి మరొకరిని రక్షించే స్థితి లేదని ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంతవరకు బయటకు రాకుండా ప్రస్తుత పరిస్థితుల నుండి బయట పడండి అంటూ తన బాధను అందరికీ తెలియచేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: