ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం మామూలుగా లేదు. వ్య‌వ‌స్థ‌లు అన్ని ఎక్క‌డివి అక్క‌డ ఆగిపోయాయి. మ‌రోసారి లాక్ డౌన్ విధిస్తే ప్రపంచానికే బ్రేక్ ప‌డడం ఖాయం. ఇక సినిమాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రెండు నెల‌ల క్రిత‌మే అన్నీ స‌ర్దుకుని సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయ‌న్న సంతోషంలో ప్రేక్ష‌కులు ఉండ‌గానే ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా దెబ్బ‌తో సినిమాల రిలీజ్‌లు లేవు. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు రిలీజ్ డేట్లు వ‌చ్చి కూడా వాయిదా ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే సినిమాలు ర‌న్ అవుతున్నా కూడా సినిమాల కలెక్షన్లు దారుణంగా వున్నాయి. వ‌కీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు హిట్ టాక్‌తో థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతున్నా కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. జ‌నాల‌కే సినిమాల‌పై ఇంట్ర‌స్ట్ త‌గ్గింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో టికెట్ ల జీవో కూడా వచ్చింది. జ‌గ‌న్ స‌ర్కార్ కొత్త జీవోతో టిక్కెట్ రేట్లు 20 ఏళ్ల క్రితంకు వెళ్లిపోయాయి. దీంతో థియేటర్లను మూత పెట్టడం ప్రారంభమైంది.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ స‌ర్కార్ జీవోపై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇక ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ సురేష్ బాబు జ‌గ‌న్ స‌ర్కారు జీవోపై తీవ్ర అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు టాక్ ? ఈ క్ర‌మంలోనే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆంధ్రలో తమకు వున్న థియేటర్లలో ముఫై నుంచి నలభై వరకు క్లోజ్ చేసింది సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ. విశాఖలో కీలకమైన జ్యోతి థియేటర్ ను కూడా మూసేసారు. కాకినాడలో అరడజను థియేటర్ల వరకు మూసేశారు. ఇక తెలంగాణ‌లో ప్ర‌స్తుతానికి ఈ ప‌రిస్థితి లేక‌పోయినా రేపో మాపో ఈ ప‌రిస్థితి త‌ప్పేలా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: