ఈ క్రమంలోనే సినిమాలు రన్ అవుతున్నా కూడా సినిమాల కలెక్షన్లు దారుణంగా వున్నాయి. వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు హిట్ టాక్తో థియేటర్లలో రన్ అవుతున్నా కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. జనాలకే సినిమాలపై ఇంట్రస్ట్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో టికెట్ ల జీవో కూడా వచ్చింది. జగన్ సర్కార్ కొత్త జీవోతో టిక్కెట్ రేట్లు 20 ఏళ్ల క్రితంకు వెళ్లిపోయాయి. దీంతో థియేటర్లను మూత పెట్టడం ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ జీవోపై ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు జగన్ సర్కారు జీవోపై తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నట్టు టాక్ ? ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రలో తమకు వున్న థియేటర్లలో ముఫై నుంచి నలభై వరకు క్లోజ్ చేసింది సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ. విశాఖలో కీలకమైన జ్యోతి థియేటర్ ను కూడా మూసేసారు. కాకినాడలో అరడజను థియేటర్ల వరకు మూసేశారు. ఇక తెలంగాణలో ప్రస్తుతానికి ఈ పరిస్థితి లేకపోయినా రేపో మాపో ఈ పరిస్థితి తప్పేలా లేదు.