అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఫీల్ గుడ్  చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాని  నాగచైతన్య చేస్తున్నాడు .. సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన వస్తుండగా ఇటీవలే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు దర్శక నిర్మాతలు..

 కరుణా కారణంగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని ఇటీవలే వారు వెల్లడించారు.. ఈ సినిమాలోని పాట అయినా "సారంగా దరియా " ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో  మనం అందరం చూశాం.. పాటలు రిలీజ్ అయినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు మొదలవగా నాగచైతన్యకు ఈ సినిమా హిట్ ఎంతగానో ముఖ్యంగా మారింది.. ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులే అవుతున్నా నాగచైతన్యకు సరైన హిట్ పడటం లేదు.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ నా గ చైతన్య ఇప్పటివరకు లేదనే చెప్పాలి.. కొన్ని సినిమాలు ఏవో యావరేజ్గా నిలువగా, మరికొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి..

 ఇక ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో నాగచైతన్య తన తదుపరి చిత్రాల రిలీజ్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నారట.. మనం లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.. మనం లాగే వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా పూర్తి చేసుకోగా మిగతా పనులను శరవేగంగా పూర్తి చేసేస్తోంది చిత్రబృందం.. ఇక మనం సి కొన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య.. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ పోస్ట్ పోన్ అవడంతో ఆ సినిమాల రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ చేయాల్సి వస్తుంది అని నాగచైతన్య భావిస్తున్నాడట.. కాగా లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఆ సినిమాని మే 13 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: