నిధి అగర్వాల్ 17 ఆగస్టు 1993 న ఆమె జన్మించింది. నిధి అగర్వాల్ హైదరాబాద్ లో పుట్టి బెంగళూరులో పెరిగారు. ఆమె మార్వారీ కుటుంబంలో జన్మించారు. నిధి అగర్వాల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళం, కన్నడ కూడా బాగా మాట్లాడతారు. ఇక ఆమె ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. విద్యశిల్ప్ అకాడమీ, విద్యా నికేతన్ పాఠశాలలో ఆమె చదువుకున్నారు. అంతేకాదు.. ఆమె బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రి పట్టా పొందారు. బెల్లీ డాన్స్ లో బాగా శిక్షణ పొందారు నిధి అగర్వాల్. టైగర్ ష్రాఫ్తో కలిసి మున్నా మైఖేల్ చిత్రంలో అగర్వాల్ కథానాయకురాలిగా నటించారు.
అయితే నిధి అగర్వాల్ 2018లో చందూ మొండేటి దర్శకత్వంలో విడుదల అయిన సవ్యసాచి చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ సరసన నటించింది. తర్వాత పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ తో కలిసి నటించారు. ఇక ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత మున్నా మైఖేల్ చిత్రానికి 2018వ సంవత్సరం లో జీ సినీ అవార్డ్స్ లో జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. టాలీవుడ్ లో ఆమెకి పలు అవకాశాలు వస్తున్నాయి.