పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ చూపు ఇపుడు బాలీవుడ్ మీదనే ఉంది వరసపెట్టి పాన్ ఇండియా మూవీస్ ని లైన్ లో పెట్టేశాడు. అదే విధంగా ప్రభాస్ తన సినిమాల సెలెక్షన్ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇక ప్రభాస్ బాహు బలి తరువాత సుజిత్ కి చాన్స్ ఇచ్చి సాహో మూవీ చేశాడు. ఆ  తరువాత రాధాక్రిష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ చేశాడు. మరో టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి చాన్స్ ఇచ్చ్చాడు. ఇక వీరితోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు అంటున్నారు. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్లు ఇతర భాషల డైరెక్టర్లకే చాన్సులు ఇస్తూ పోతున్నాడు.

ఆదిపురుష్ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇక సలార్ మూవీకి కన్నడ డైరెక్టర్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరో కొత్త మూవీకి కోలీవుడ్ కి చెందిన లోకేష్ కనగరాజ్ ని సెలెక్ట్ చేసి పెట్టాడని టాక్ నడుస్తోంది. ఇక ప్రభాస్ ఆ తరువాత చేసే మూవీస్ కి కూడా ఇతర భాషల డైరెక్టర్లనే ఎంపిక చేసుకుంటున్నాడు.

దీంతో ప్రభాస్ తో చేద్దామని అనుకుంటున్న తెలుగు డైరెక్టర్లకు చాన్స్ ఎక్కడా దక్కడంలేదు. ప్రభాస్ మరి ఈ విషయంలో వేరే ఆలోచనలు చేయడంతో ఇప్పట్లో టాలీవుడ్ కి నో చాన్స్ అన్నట్లుగానే సీన్ కనిపిస్తోందిట. ప్రభాస్ ని డైరెక్ట్ చేసే చివరి డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ ఉన్నారు. ఆ తరువాత ప్రభాస్ అంతా బాలీవుడ్ తోనే అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ టాలీవుడ్ ను దాటేశాడు. అన్ని బౌండరీస్ ని కూడా దాటేసుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టేశాడు. తెలుగు వారికి ఇది గర్వకారణం అయినా తెలుగు దర్శకులకు మాత్రం ఇది కొంత ఇబ్బందిగానే ఉందిట. మరి వారు మంచి కధతో ముందుకు వస్తే ఫ్యూచర్ లో అయినా ప్రభాస్ చాన్స్ ఇస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: