బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణం ఇప్పటికీ ఎవరూ మర్చిపోవడం లేదు.. ఆయన మరణం తరువాత బాలీవుడ్ లో చెలరేగిన ప్రకంపనలు అందరికీ తెలిసినదే.. తీగ లాగితే డొంక కదిలినట్లు సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లోని పలు లోపాలను బయటపెట్టింది..  డ్రగ్స్ వ్యవహారం, నేపోటీజం  వంటి కీలక అంశాలు బాలీవుడ్ లో ఏ రేంజిలో ఉన్నాయో సుశాంత్ సింగ్ మరణం తెలియజేసింది.. ఇక తాజాగా బాలీవుడ్ లో మరొక హీరో ని తొక్కేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసిన వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్.. ముఖ్యంగా కరణ్ జోహార్  ని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది..

 ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.. పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్ లో  హీరో గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు  కార్తీక్.. నటనలో, డాన్స్ లో తనదైన  ముద్ర వేసుకుంటూ మంచి పాపులారిటీ తో పాటు ఫ్యాన్ బేస్  కూడా సంపాదించు కున్నాడు.. ఈ హీరో ను తాజాగా కరణ్  జోహార్ తన ప్రొడక్షన్ లో నిర్మితమవుతున్న దోస్తానా 2 సినిమా నుండి తప్పించాడు.. కారణం ఏమైనా కూడా దోస్తానా వంటి హిట్ సినిమా కి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా నుండి కార్తీక్ని తప్పించడం పట్ల బాలీవుడ్లో ఇప్పుడు ఆయనపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి..

 ఇప్పటికే నేపోటీజం అంటూ  అట్టుడికి పోతున్న బాలీవుడ్ ఈ విషయం తో మరింత గా  చర్చకు దారితీస్తుంది.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగానే కార్తీక్ ని కూడా డ్రక్స్ అని, అండ్ ప్రొఫెషనల్ అని రకరకాల కారణాలు చూపించి అతన్ని ఈ సినిమా నుంచి తప్పించారు.. కరణ్  కేవలం స్టార్ కిడ్స్ కి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని, టాలెంట్ ఉన్న వ్యక్తులని తొక్కేస్తు, వారికి వచ్చిన అవకాశాలను కూడా వెనక్కి తీసుకుంటూ, వారి పాలిట యముడు గా మారుతున్నాడు అని కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.. ఈమెతో పాటు మరికొందరు కూడా కరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: