అక్టోబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ప్రేక్షకులు బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.. కాగా ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే విజయ్ దేవరకొండ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా కాగా మరొకటి సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా.. శివ నిర్వాణ ప్రస్తుతం నా ని టక్ జగదీష్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమా రిలీజ్ అవగానే విజయ్ దేవరకొండ తో చేతులు కలుపుతాడు శివ నిర్వాణ..
ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమాని మొదలు పెట్టను న్నాడు.. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలు కి షికార్లు చేయగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సాయిపల్లవి ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.. టాలీవుడ్ అ రడజను సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది సాయి పల్లవి..