రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతుండటం విశేషం.. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాని కరణ్ జోహార్ తో కలిసి హీరోయిన్ ఛార్మి నిర్మిస్తుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ అందుకుంది.. విజయ్ దేవరకొండ గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి..

అక్టోబర్ 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ప్రేక్షకులు బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.. కాగా ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే విజయ్ దేవరకొండ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా కాగా మరొకటి సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా.. శివ నిర్వాణ ప్రస్తుతం నా ని టక్ జగదీష్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ సినిమా రిలీజ్ అవగానే విజయ్ దేవరకొండ తో చేతులు కలుపుతాడు శివ నిర్వాణ..

 ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమాని మొదలు పెట్టను న్నాడు.. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలు కి షికార్లు చేయగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.. టాలీవుడ్ లో  టాప్ హీరోయిన్ గా  వెలుగొందుతున్న సాయిపల్లవి ని  ఈ సినిమాలో హీరోయిన్ గా  ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.. టాలీవుడ్  అ రడజను సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది సాయి పల్లవి..

మరింత సమాచారం తెలుసుకోండి: