ఓ వైపు యాంకర్ గా పలు షో లకి వ్యాఖ్యాతగా చేస్తూనే ఇంకోవైపు అనసూయ వరుస సినిమాలలో నటిస్తుంది.. క్షణం సినిమాతో పూర్తిస్థాయి నటిగా మారిన అనసూయ ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళుతోంది.. ఆమె కెరీర్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమాగా మిగిలిపోతుంది రంగస్థలం.. ఆ సినిమాలో రంగమ్మత్త గా అనసూయ ఎవర్ గ్రీన్ నటనను చేసింది.. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అనసూయ.. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ షో తో మంచి పేరు సంపాదించుకుంది.. అక్కడ వచ్చిన పాపులారిటీ తోనే సినిమాల్లో అవకాశం దక్కించుకుంది..

సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించడమే కాకుండా ఆమె ప్రధాన పాత్రల్లో కూడా కొన్ని సినిమాలు తెరకెక్కిన్నాయి.. తాజాగా ఆమె థాంక్యూ బ్రదర్ ఆమె సినిమాలో నటిస్తోంది.. అశ్విన్ విరాజ్ మరొక కీలక పాత్రలో నటిస్తుండగా రమేష్ రాపర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై మంచి ఆసక్తిని కలిగించగా అంచనాలను కూడా ఏర్పరచాయి.. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.. ఈ మేరకు వారు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు..

 యువసామ్రాట్ నాగచైతన్య తన ట్విట్టర్ వేదికగా ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉందని, సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది అని, ఈ ట్రైలర్ ని చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోయాను అని నాగచైతన్య అన్నారు.. ఈ సినిమాని జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మాగుంట శరత్  చంద్రారెడ్డి, తారక్ నాథ్  బొమ్మిరెడ్డి లు నిర్మించారు.. ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరారు..అల్ ది బెస్ట్ అన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: