నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ఆయన ను చూసిన వారే స్వయంగా చెప్పారు.. క్రమశిక్షణ లేకుంటే ఫ్యాన్ ను కొట్టడానికి సైతం వెనుకాడరు.. గతంలో రెండు మూడు సందర్భాల్లో ఫ్యాన్ ని కొట్టారు బాలకృష్ణ.. ఫ్యాన్స్ పట్లనే ఇలా ఉంటే బాలకృష్ణ సినిమా విషయంలో ఇంకెంత క్రమశిక్షణతో మెలుగుతారు అందరికీ తెలిసిందే.. సినిమాని దైవంగా భావించే హీరోలలో బాలకృష్ణ ఒకరు.. తండ్రి ఎన్టీఆర్ వద్దనుండి ఈ నియమాన్ని నేర్చుకోగా ఇప్పటికీ అదే నియమాన్ని పాటిస్తూ.. సినిమా ని, సినిమాకు పనిచేసే వ్యక్తులను గౌరవిస్తూ ఉంటారు.. ఉదయాన్నే షూటింగ్ అంటే షూటింగ్ కి గంట ముందు వెళ్లే హీరోల్లో ఈయన ఒకరు..

 అలాంటి బాలకృష్ణ ఇంత పెద్ద హీరో రావడానికి ముఖ్య కారణం ఆయన క్రమశిక్షణ అనే చెప్పొచ్చు.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాని చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ.. ప్రగ్యా జైస్వాల్  హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ చిత్రం నుండి ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వచ్చింది.. గత కొన్ని సినిమాలుగా ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నా బాలకృష్ణ కు ఈ సినిమా హిట్ ఎంతో అవసరం.. అటు దర్శకుడు బోయపాటి శ్రీను కు కూడా ఈ సినిమా హిట్ అవడం ఎంతో ముఖ్యం గా మారింది.. మరి ఈ ఇద్దరికీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా వారికి ఏ రేంజ్ హిట్  ఇస్తుందో చూడాలి..

 ఇక ఇటీవలే జరిగిన  ఓ విషయం బాలకృష్ణ గురించ,  ఆయన వ్యక్తిత్వం గురించి తెలియజేసింది... వీరభద్ర సినిమా షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది అదేంటంటే... షూటింగ్ సమయంలో ఆ సినిమా దర్శకుడు అయిన రవికుమార్ చౌదరి తాగి షూటింగ్ కి రావడంతో బాలకృష్ణ ఆయనపై కేకలు వేశారట.. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత అయిన అంబికా కృష్ణ వెల్లడించారు.. ఇక ఆ సినిమా ఎట్లాంటి ఫలితాన్ని అందించిందో మనకు తెలిసిందే.. సినిమా పట్ల అందరూ జాగ్రత్తగా ఉంటేనే హిట్ అవడం ఈ రోజుల్లో కష్టం అవుతుంది..  ఈ నేపథ్యంలో దర్శకుడు అలా రావడం వల్ల నిర్మాతకు ఎంతో నష్టం చేకూరుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: