సమంత నాగ చైతన్య తో  పెళ్లి అయిన తర్వాత చేసిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ప్రస్తుతం సమంత  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో  ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది.

 శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడి చేస్తున్నారు మూవీ టీం.ఈ శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న సమంతసినిమా షూటింగ్ కోసం రెడి అవుతుంది.అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో ఇంకొక సినిమా చేయబోతోంది.

ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య కూడ ఒక గెస్ట్ రోల్ చేశారు. అయితే నందిని రెడ్డి ఆమె తర్వాత సినిమాలో కూడా నాగ చైతన్య ని గెస్ట్ రోల్ పెట్టె ఆలోచనలో ఉందని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: