బాలీవుడ్ ముద్దుగుమ్మ
అలియా భట్ ఏప్రిల్ నెలలో
హైదరాబాద్ లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో ఆమెకు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో
రాజమౌళి కి షూటింగ్ షెడ్యూల్ కాన్సల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న
అలియా భట్ హైదరాబాద్ కి వచ్చి
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి
మూవీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీనితో ఆమె
ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ మేరకు
రామ్ చరణ్ కి
ఫోన్ చేసి
ఆలియా భట్ తన రాక గురించి కూడా చెప్పారని సినీ వర్గాల సమాచారం. కానీ
రాజమౌళి మాత్రం పెదవి విరిచారట. ఎందుకంటే.. గత కొద్దిరోజులుగా ఆచార్య
మూవీ షూటింగ్ లో
రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా ఆయన చరణ్, చిరు లతో కలసి షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అతనికి కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మెగా హీరోస్ ముందుజాగ్రత్తగా
హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లి పోవాల్సి వచ్చింది.
రాజమౌళి కూడా చరణ్ క్వారంటైన్ పీరియడ్ అయిపోయేంత వరకు వేచి చూసేందుకు సిద్ధమయ్యారు.
తొందరపడి
అలియా భట్, చెర్రీ లను షూటింగ్ కి పిలిస్తే అందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంది. అందుకే
రాజమౌళి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ
మూవీ యూనిట్ ని కరోనా నుంచి రక్షించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇకపోతే
ఆర్ఆర్ఆర్ అలియా భట్ కెరీర్ లో తొలి తెలుగు
సినిమా కానుంది. చెర్రీ
అల్లూరి సీతారామరాజు గా.. ఆమె
సీత గా కనిపించనున్నారు.
అక్టోబర్ 13వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కరోనా మహమ్మారి సమయంలో ముందుగా అనుకున్న తేదీకి
సినిమా విడుదల అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.