ఇంటర్నెట్ డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే సినిమాలో కాస్టింగ్ ఎంపిక చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి కొరటాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. హీరోయిన్ కోసం మొదట బాలీవుడ్ బ్యూటీలను వెదుకుతున్నాడట. అయితే తాజాగా కొరటాలకు హీరోయిన్ దొరికినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెంచుకుంటున్న తారక్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ కొత్త సినిమా ఉండబోతోందట. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో ఉన్న కొరటాల దానిని పూర్తి చేసి జూన్, జులై నెలల్లో ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామని తీసుకోవాడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే హాట్ బ్యూటీ కైరా అద్వానీని సంప్రదించారట. అయితే కియరా హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కొత్త హీరోయిన్ సాయీ మంజ్రేకర్‌ని తీసుకోవాలని కొరటాల టీం ప్లాన్ చేస్తోందట.

ఇదిలా ఉంటే సాయీ మంజ్రేకర్ ఇప్పటికే తెలుగులో మేజర్ సినిమాతో పాటు, మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి గని సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల కారణంగా సాయీకి తెలుగులో కూడా ఇటీవల డిమాండ్ పెరిగింది. ఒకపక్క బాలీవుడ్ బ్యూటీ కావడం, తెలుగులోనూ మార్కెట్ పెరగడం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సాయీ మంజ్రేకర్‌ని హీరోయిన్‌గా సెలెక్ట్ చేయాలనే యోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. ఈ మూవీని కళ్యాణ్ రామ్‌తో కలిసి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: