ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలున్నాయి. అందులో ఒకటి ఆదిపురుష్ కాగా.. మరొకటి కేజీఎఫ్తో స్టార్ డైరెక్టర్గా మారిన సౌత్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండిండికంటే ముందు జిల్ ఫేమ్ రాథాకృష్ణ డైరెక్షన్లో రానున్న రాధేశ్యామ్ కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే రానుంది. వీటితో పాటు మరో ప్యాన్ ఇండియా సినిమాకు కూడా ప్రభాస్ సైన్ చేశాడు. కాగా.. ఆదిపురుష్ షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు పాన్ ఇండియా కథలని సిద్ధం చేసుకొని ప్రభాస్ను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలోనే సిద్ధార్ధ ఆనంద్ ఓ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ప్రభాస్కి వినిపించాడని, దీనికి ప్రభాస్ నుంచి కూడా సానూకూల స్పందన వచ్చిందని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా బాలీవుడ్లో అడుగుపెట్టబోతోందట.
ఇది మాత్రమే కాదు.. ప్రభాస్తో సినిమా తీయాలని సంజయ్ లీలా బన్సాలీ కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో జోరూగా రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే ధూమ్ సీరీస్ 4లో ప్రభాస్ని విలన్గా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, అదే జరిగితే మన టాలీవుడ్నుంచి బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ హీరోలను సైతం దాటేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించడం ఖాయం.