ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై తెగ మోజు చూపిస్తున్నారు. అలాంటి కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నిర్మాతలు కూడా పాన్ ఇండియా కథలకు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖచ్చు చేయడానికి రెడీగా ఉంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే దారిలో వెళుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్లో బన్నీ ప్యాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పుష్ప టీజర్ కూడా ఆ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

పక్కా మాస్ యాక్షన్‌తో స్మగ్లర్‌లా మారిన బన్నీని చూసేందుకు అభిమానులు తెగ ఆరాటపడిపోతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ మధ్యలో ఏమైందో ఏమో కొరటాల.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో బన్నీ-కొరటాల సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

కాగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్-కొరటాల శివ కొత్త సినిమా కథ లీక్ అయిందనే వార్తలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ తమిళ రీమేక్ సినిమా స్టోరీని పోలి ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ల ప్రకారం.. తమిళంలో తెరకెక్కి తెలుగులో రీమేక్ అయిన యువ సినిమా కథలానే బన్నీ-కొరటాల సినిమా కథ ఉంటుందట. స్టూడెంట్స్ పాలిటిక్స్ ప్రధానంగా పాన్ ఇండియా అప్పీల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ తో పాటు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే కొరటాల శివ-బన్నీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాలన్నీ అసత్యాలని నిర్మాత నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చారు. 2022 సంవత్సరం మే నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఆ సినిమాకు సంబంధించిన కథ గురించిన రూమర్లు బయటకు రావడం సంచనలనంగా మరింది. అయితే పుష్ప సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: