విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమా రీమేక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా రషెస్ చూసిన సురేష్ బాబు ఫైనల్ కట్ కోసం పలు కీలక సన్నివేశాల్లో మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఏవైతే సీన్లు నచ్చలేదు ఆ సీన్లు అన్ని మళ్లీ రీ షూట్ చేయాలని దర్శకుడిని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక వెంకటేష్ దృశ్యం 2 సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనగా ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.

 విక్టరీ వెంకటేశ్‌, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ సినిమాకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను కరోనా కారణంగా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల అయ్యింది. దానిని రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ సమస్త 'దృశ్యం-2' డైరెక్ట్ డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సురేష్ బాబు 'దృశ్యం-2'ను నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేయాలని భావిస్తున్నాడు.

 ఆయన ఆలోచనకు తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ కూడా 'దృశ్యం-2' డిజిటల్ హక్కుల కోసం భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఎంత ఆఫర్ చేసిందనే విషయం బయటకు రాలేదు కానీ గట్టిగానే ఆఫర్ చేసినందని మాత్రం అంటున్నారు. సురేష్ బాబు ప్రస్తుతం చివరి దశలో ఉన్న 'నారప్ప'పై దృష్టి సారించారని అంటున్నారు. మరోపక్క ఈ రెండు సినిమాల షూటింగ్ లు పూర్తి చేసిన వెంకటేష్ ఎఫ్ 3 పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: