ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దిరి కాంబినేషన్‌లో సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్‌మెంట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించబోతున్నారు.

సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి సినిమా ఇది. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో మంచి సక్సెస్‌ఫుల్ స్టోరీ కూడా తయారైంది. కానీ, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. అలాగే.. పుష్ప సినిమా షూటింగ్‌కు కూడా ఇంకాస్త సమయం తీసుకునేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే కరోనా నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా సినీ పరిశ్రమలో చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా క్యాన్సిల్ అయినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ స్పందించింది. ముందుగా ఎంచుకున్న ప్రణాళిక ప్రకారం.. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లోనే సినిమా ప్రారంభం కానుందని తెలిపింది. వీరిద్దరి కాంబినేషన్‌లో కచ్చితంగా సినిమా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్యపాండే నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సిని

మరింత సమాచారం తెలుసుకోండి: