బాహుబలి ముందు
ప్రభాస్ వేరు.. తర్వాత
ప్రభాస్ వేరు.. పాన్
ఇండియా స్టార్ గా అందరి మనసును దోచుకున్నాడు. ప్రస్తుతం
డార్లింగ్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ పాన్
ఇండియా చిత్రాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధ
కృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధే
శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో
ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అటు
కేజీఎఫ్ వంటి
బ్లాక్ బస్టర్ పాన్ చిత్రాన్ని తెరకెక్కించిన
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్
సినిమా లో నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ కూడా జరుగుతుంది. కాగా,
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న
సినిమా ‘ఆదిపురుష్’. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే ఈ
సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.. ఇప్పుడు ఈ
సినిమా పై వస్తున్న వార్తల పై
డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.ఈ
సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయ్యింది.ప్రధాన పాత్రధారులు గత సంవత్సరం ప్రిన్సిపల్ ఫోటో గ్రఫీని పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఈ చిత్రం కోసం
ప్రభాస్, సైఫ్ పాత్రలకు తగ్గట్లు చేంజ్ అయ్యారు.
వీరందరూ పెద్ద స్టార్లు.. వీరితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ డైరెక్టర్ చాలా సందర్భాల్లో వెల్లడించారు.ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. కృతి సనన్ సీత పాత్ర, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడి గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా పై వస్తున్న రూమర్స్ ను నమ్మవద్దని, ఏదైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే మేకర్స్ అధికారికం గా ప్రకటిస్తారని పేర్కొన్నారు..