పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. పవన్ వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ హిట్ గా ఉంది. ఈ మూవీకి అనుకున్న సొమ్ము వచ్చిందని అంటున్నారు. పవన్ తో సినిమా తీయాలని ఇప్పటికీ చాలా మంది నిర్మాతలు క్యూ కట్టి ఉన్నారు. ఈ నేపధ్యంలో పవన్ వరసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారుట.

పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సెట్స్ మీద ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీర  మల్లు మూవీ  షూటింగ్  శరవేగంగా సాగుతోంది. దాంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ మూవీ కూడా షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు మూవీస్ తరువాత పవన్ చేసే కొత్త మూవీస్ కి కూడా అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. ఆ సినిమాలను హరీష్ శంకర్, సురెందర్ రెడ్డి తీస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది.

మరి ఇన్ని సినిమాలు ఉండగాఎన పవన్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడని అంటున్నారు. ఆ సినిమాను జేబీ ఎంటర్టైమెంట్స్ వారు నిర్మిస్తారు అంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా జేబీ ఎంటర్టైన్మెంట్శ్ అధినేతలు భగవాన్, పుల్ల్లారావు చెప్పారు. వారు ప్రస్తుతం పవన్ మేనల్లుడు సాయి ధర్మ తేజ్ హీరోగా రిపబ్లిక్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తొందరలో రిలీజ్ కానుంది.

ఇక తమ తరువాత సినిమా కచ్చితంగా పవన్ తో ఉంటుందని వారు అంటున్నారు. పవన్ తో సినిమా తీసి హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి నాలుగు సినిమాలు కంప్లీట్ చేశాక పవన్ వీరితో జాయిన్ అవుతాడా లేక జేబీ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు చెబుతున్నట్లుగా వచ్చే ఏడాది పవన్ సినిమా వీరితో ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా కనుక కమిట్ అయితే పవన్ రీ ఎంట్రీ తరువాత అరడజన్ సినిమాలు చేస్తున్నట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: