టాలీవుడ్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారిగా ఈ సినిమా ద్వారా ఆయన ఒక మాజీ నక్సలైట్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అలానే తొలిసారిగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరంజీవిసినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అలానే ఇటీవల ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మణిశర్మ స్వరపరిచిన లాహే లాహే అనే సాంగ్ కూడా యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. దేవాలయాల్లోని పలు భూముల కుంభకోణాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు విషయం ఏమిటంటే ఇటీవల ప్రేక్షకాభిమానులకు మరింత చేరువ అవడం కోసం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ తెరిచిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుంచి తరచూ తన సినీ వ్యక్తిగత విషయాలను గురించిన సమాచారం వారితో పెంచుకుంటూ వస్తున్నారు.

ఇక నేడు శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ పెట్టిన సందేశాత్మక డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం, కలసి నడవాలన్నది సీతతత్వం, పుణ్య దంపతులైన ఆ సీతారాముల శుభాశీస్సులతో మన అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: