రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి ఇతర పాత్రల్లో నటిస్తుండగా సౌత్ వర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్నందిస్తున్నారు. మనోజ్ పరమహంస మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ సినిమాతో పాటు ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అలానే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు కూడా మొదలెట్టారు ప్రభాస్.

వీటిలో ముఖ్యంగా ఆదిపురుష్ గురించి చెప్పాలంటే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి కథ గా తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ మూవీ లో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తుండగా రావణాసురుడి పాత్రని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడు గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాకి టి భూషణ్ కుమార్ నిర్మాత. ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ చెప్పారు.

అసలు మ్యాటర్ ఏంటంటే నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది అంటూ నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఆదిపురుష్ నుండి అప్డేట్ కు సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతకీ అసలు అప్ డేట్ అనేది ఇవ్వాళ ఉందా లేదా అంటూ మరికొందరు అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆదిపురుష్ టీమ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: