టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ "అఖండ" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'అఖండ' సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ కనిపించనుంది. పవర్ ఫుల్ విలన్ పాత్ర నటుడు శ్రీకాంత్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్. తొలిసారి బాలయ్య ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాలు అరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.


గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సినిమాలు ఊర మాస్ హిట్ అవ్వడంతో మూడవ సారి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డేట్ మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. అప్పుడు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ కి అలాగే రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి భారీ స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఇంకా రెట్టింపు అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది.

బాలయ్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రికార్డు ధరలో భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులను రూ.15 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.ఇది బాలయ్య కెరీర్ లోనే పెద్ద రికార్డు అని చెప్పాలి.అలాగే ఈ సినిమా టీజర్ ఇప్పటిదాకా యూ ట్యూబ్ లో 28 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఇక రీసెంట్ గా ఈ డీల్ క్లోజ్ అయింది. బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. మరో రెండు వారాల సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. బాలయ్య కొన్నాళ్లపాటు షూటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: