మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా నరేష్, జగపతిబాబు, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, ఈషా రెబ్బా తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇక దీని అనంతరం గత ఏడాది అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన మరో బ్లాక్ బస్టర్ సినిమా అలవైకుంఠపురములో. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు దీన్ని ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి.
ఈ మూవీకి కూడా తమన్ సంగీతాన్ని అందించగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే మహేష్ బాబు కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించిన త్రివిక్రమ్ ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనుండగా మరొకసారి ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మరోవైపు రెండు రోజుల నుంచి ఈ సినిమా విషయమై మరొక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.

దానిని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ముందుగా పూజ హెగ్డే ని తీసుకుందామని భావించినప్పటికీ ప్రస్తుతం ఆమె కాల్షీట్స్ ఖాళీగా లేని కారణంగా ఆమె స్థానంలో శృతిని తీసుకుంటున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాలో ఇంతకీ పూజ హెగ్డే నటిస్తోందా లేక శృతి హాసన్ నటిస్తున్నారా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే ఆ మూవీ యూనిట్ నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: