సూపర్ స్టార్ మహేష్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సక్సెస్ ఫుల్ మూవీ భరత్ అనే నేను. తాజా రాజకీయాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి భరత్ అనే పాత్రలో అత్యద్భుత నటన కనబరిచి ఆడియన్స్ నుంచి బాగా పేరు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పలికిన డైలాగులు, యాక్షన్, ఫైట్స్ కి ఫాన్స్ నుండి మరింతగా ప్రశంసలు దక్కాయి.
బాలీవుడ్ నటి కియారా అద్వాని తొలిసారిగా మహేష్ కు జోడిగా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా తిరు, రవి కే చంద్రన్ ఫోటోగ్రఫీ అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు మహేష్, కొరటాల కాంబినేషన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో హోలీ ఫైట్ ఒకటి చిత్రీకరించారు,అప్పట్లో దాని మేకింగ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ల అనంతరం దానిని యాడ్ చేస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ భావించారు.

కానీ సినిమా విడుదలై ఆపై టెలివిజన్ లో కూడా వేసినప్పటికీ దానిపై భరత్ అనే నేను యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఇటీవల ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు పలువురు మహేష్ బాబు అభిమానులు భరత్ అనే నేను మూవీ యూనిట్ ని ఉద్దేశించి, సార్ మా హీరో సినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లయింది ఇంకా హోలీ ఫైట్ విషయమై ఊసే లేదు ఇంతకీ అది రిలీజ్ చేస్తారా లేదా అంటూ  సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై భరత్ అనే నేను ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: