డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కి ఎంతటి ఘన విజయం సాధించింది పెట్టిందో అందరికీ తెలుసు. నటుడుగా రామ్ చరణ్ ఈ  సినిమాకు హైలెట్ గా నిలిచాడు. అదే సినిమాలో కూడా మరొకరికి పేరు కూడా తీసుకొచ్చింది. ఆమె ఎవరో కాదు అనసూయ అలియాస్ రంగమ్మత్త. ఈ సినిమాలో అనసూయ అదరగొట్టేసింది అని చెప్పవచ్చు. అప్పటివరకు అనసూయలో  ఇంతమంచి యాక్టర్ దాగివుంది అని ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే చేయబోతోందని టాక్.

అలాగే ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ని చేసిందని చెప్పవచ్చు. అనసూయ  పుష్పా సినిమా లో  అలాంటి పాత్ర ఒకటి చేస్తోందట. అయితే మొదటి సినిమా తరహా పాత్ర అయితే కాదు కానీ, అంతటి పేరు తెచ్చే పాత్ర ఇది మాత్రం అని  తెలుస్తోంది. పుష్ప సినిమా షూటింగ్ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల పుష్ప సినిమా నుంచి  అనసూయ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారట.

ఈమె ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టం గా తెలిసిపోతోంది. ఎందుకంటే పుష్ప అడవులు, గ్రామాల నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి. అయితే మరి అనసూయ ఎందుకు అలా నటిస్తుందో, మనకు తెర మీద ఎలా కనిపించపోతుందో అనేది త్వరలోనే తెలుస్తుంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ  సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి డేట్ కూడా చెప్పలేమని తేల్చేశారు చిత్రం యూనిట్ సభ్యులు..


ఇదిలా పక్కన పెడితే రంగస్థలం సినిమా లో రంగమ్మత్త గా నటించిన పాత్రలో, అనసూయకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి పుష్ప సినిమాలో కూడా అలాంటి పాత్రలో నటించక పోయినప్పటికీ , అంతకంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంటుందో లేదో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: