మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు ఎంతటి హుషారుగా ప్రేక్షకులను అలరిస్తాడో అందరికి తెలిసిందే.. తాజగా పులి పిల్లలతో ఆడుకుంటూ ఓ ఫోటోను రిలీజ్ చేశాడు.. దీంతో సాయి ధరమ్ తేజ్ ఈ పిక్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పుకుంటున్నారు అభిమానులు.. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో హిట్ కొట్టిన సాయి తేజ్ ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా ను చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మెగా హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. మొదట్లో ఆటుపోట్లు తిన్నా ఇప్పుడు వరుస హిట్లతో పాటు సినిమాల ఎంపిక లోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేశాడు..

ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి..ప్రతి రోజు పండగ, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు చేస్తున్న రిపబ్లిక్ సినిమా హిట్ అవుతుందో చూడాలి.. తేజ్ సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. ఈరోజు తేజ్ చాలా స్పెషల్ డే అంటున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు. కానీ ఆ ఫోటోలో తేజ్ తో పాటు రెండు పులి పిల్లలు కూడా ఉన్నాయి. అవి తేజ్ పెంచుకునేవే. ఈరోజు ఎర్త్ డే సందర్బంగా తన పెట్ కబ్స్ తో సాయితేజ్ ఫోటో పోస్ట్ చేసాడు. ఫోటోలో రెండు పులి పిల్లలు ఆడుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: