టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీని అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఉద్యోగిని పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మన భారతీయ బ్యాంకులని కుదిపేసిన పలు ఆర్థిక నేరాలను బేస్ చేసుకుని ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుండగా, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవల తొలి షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కొన్నాళ్ళ క్రితం హైదరాబాదులో ప్రారంభమైంది. అయితే కొద్ది రోజుల నుంచి కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ కావడంతో ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ ని ఇటీవల నిలిపివేశారు. ఇక అసలు విషయం ఏమిటంటే తరచూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులు అభిమానులతో తన సినీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అలవాటు గల సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం భావోద్వేగ భరితంగా ఒక పోస్ట్ చేశారు.

భూమాతను రక్షించడం మానవుడి కర్తవ్యం అలానే ఆమెను గౌరవించడం, ప్రకృతిని కాపాడటం వంటి వాటి కోసం మనం మన వంతుగా పాటుపడి దానికి రక్షణ కల్పించాలని కోరుతూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక మహేష్ పెట్టిన ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. ప్రకృతిని, భూమాతను కాపాడమంటూ మహేష్ బాబు మరొక్కసారి తన మంచి మనసుని తన పోస్ట్ ద్వారా చాటుకున్నారు అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: