ఆ తర్వాత యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీతగోవిందం తో మరో బ్లాక్బస్టర్ సొంతం చేసుకున్న విజయ్ అక్కడి నుండి వరుస అవకాశాలతో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో గా మరింత పేరుతో కొనసాగుతున్నారు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దాదాపుగా రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
ఇక దీని తర్వాత ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. కాగా ఈ సినిమా ఆగస్టు తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ కనపడుతుంది. ఇక ఈ రెండు సినిమాల పై కూడా విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రేపు రిలీజ్ తర్వాత ఈ రెండు కనుక మంచి సక్సెస్ సాధిస్తే హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విపరీతంగా పెరగడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ రెండు సినిమాలు విజయ్ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయక తప్పదు....!!