ఇక రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న వకీల్ సాబ్ విజయంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ డ్రామా మూవీ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక కీలక పాత్ర చేస్తోంది. సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే వజ్రాలదొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
మరోవైపు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపారు ఆ చిత్ర నిర్మాతలు. అయితే ప్రస్తుతం మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిద్ సెకండ్ వేవ్ ప్రభావం ఎంతో ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే విడుదల కావాల్సి సినిమాలు మరో నెల రెండు నెలలు వరకు వాయిదా పడే చాన్సు కనపడుతుంది. ఇక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే ఛాన్స్ ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు రెండూ కూడా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారికంగా మాత్రం న్యూస్ వెలువడాల్సి ఉంది.....!!