కరోనా సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరిపోవడంతో మూడు లక్షల స్థాయిలో కేసులు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్న పరిస్థితులలో సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు విపరీతమైన భయానక పరిస్థితులలో రోజులు గడుపుతున్నారు. టాప్ యంగ్ హీరోలు అంతా సినిమా షూటింగ్ లు అంటేనే బెదిరిపోతున్నారు.  


ఇలాంటి పరిస్థితులు తట్టుకోలేక రామ్ చరణ్ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చరణ్ కు లేటెస్ట్ గా తగిలిన ఒక షాక్ అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ వ్యానిటీ బస్ డ్రైవర్ ఈమధ్యనే కరోనా తో చనిపోయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.


డ్రైవర్ పట్ల ఉన్న అభిమానంతో చరణ్ అతడికి చాల మంచి వైద్యం చేయించినప్పటికీ రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవ్వడంతో ఆ డ్రైవర్ చనిపోయాడు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. రామ్ చరణ్ కు ఆ డ్రైవర్ చనిపోయిన సంఘటన ఊహించని షాక్ గా మారడంతో షూటింగ్ ల గురించి మర్చిపోయి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


యంగ్ హీరోల పరిస్థితి ఇలా ఉంటే సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను లెక్క చేయకుండా అదేవిధంగా మండిపోతున్న ఎండలను కూడ పట్టించుకోకుండా బాలయ్య తన ‘అఖండ’ సినిమా షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ లో నటిస్తూ తన తోటి నటీనటులకు కూడ ఉత్సాహాన్ని కలిగిస్తూ గాయత్రి మంత్రాన్ని అమ్మవారిని నమ్ముకుంటే ఎవర్నీ కరోనా ఏమి చేయదు అంటూ ధైర్యాన్ని కలిగించడమే కాకుండా ఈ మూవీ షెడ్యూల్ ను ఇలాంటి పరిస్థితులలో కూడ ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగిస్తూ ‘అఖండ’ ఖచ్చితంగా మే 28న విడుదలై అఖండవిజయం సాధిస్తుందని తన యూనిట్ కు నమ్మకాన్ని కలిగిస్తూ తీస్తున్న పరుగులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: