కొరటాల శివ ఆచార్య సినిమాని పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడట అయితే ఆచార్య తరువాత కొరటాల అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఎన్టీఆర్ లాక్ ఆవడంతో ఆ సినిమా కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది.. అల్లు అర్జున్ కూడా ఐకాన్ సినిమాను ఈ గ్యాప్ లో చేయనున్నాడట, ఇది త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయడానికి మూవ్ అయిపోయాడు.. ఏదేమైనా తమ నెక్స్ట్ సినిమా ల జాబితా కొంచెం కన్ఫ్యూజ్ అయినా చివరికి అందరికీ సెట్ అయిపోయింది..
అయితే ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా ఒప్పుకునే ముందు మరో ఇద్దరూ దర్శకులతో కూడా సినిమాని మొదలు పెట్టబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.. వారిలో ఒకరు ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరొకటి అట్లీ దర్శకుడిగా సినిమా.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఫిక్స్ అవడంతో ఎన్టీఆర్ తో సినిమా లేనట్లే అని ఖరారైంది.. అట్లీ కూడా బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తూ ఉండడంతో ఆయనతో సినిమా కూడా లేనట్లే అని తెలుస్తోంది.. మొత్తానికి టాప్ డైరెక్టర్లతో సినిమా చేద్దామని ప్రయత్నించిన ఎన్టీఆర్ కి ఆ కోరిక ఫలించలేదు..కొరటాల శివ వారి రేంజ్ లో ఉంటుందా చూడాలి..