యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో తను కూడా పాన్ ఇండియా రేంజ్ హీరో అనిపించుకో బోతున్నాడు.. దీంతో తన తదుపరి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ తో ఓ సినిమాను ప్లాన్ చేశాడు కానీ కారణాలతో ఇంకా తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది దాంతో కొరటాల శివ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

కొరటాల శివ ఆచార్య సినిమాని పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడట అయితే ఆచార్య తరువాత కొరటాల అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అయితే  ఎన్టీఆర్ లాక్ ఆవడంతో ఆ సినిమా కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది..  అల్లు అర్జున్ కూడా ఐకాన్ సినిమాను ఈ గ్యాప్ లో చేయనున్నాడట, ఇది త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయడానికి మూవ్ అయిపోయాడు.. ఏదేమైనా తమ నెక్స్ట్ సినిమా ల జాబితా కొంచెం కన్ఫ్యూజ్ అయినా చివరికి అందరికీ సెట్ అయిపోయింది..

అయితే ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా ఒప్పుకునే ముందు మరో ఇద్దరూ దర్శకులతో కూడా సినిమాని మొదలు పెట్టబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.. వారిలో ఒకరు ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరొకటి అట్లీ దర్శకుడిగా సినిమా.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఫిక్స్ అవడంతో ఎన్టీఆర్ తో సినిమా లేనట్లే అని ఖరారైంది.. అట్లీ కూడా బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తూ ఉండడంతో ఆయనతో సినిమా కూడా లేనట్లే అని తెలుస్తోంది.. మొత్తానికి టాప్ డైరెక్టర్లతో సినిమా చేద్దామని ప్రయత్నించిన ఎన్టీఆర్ కి ఆ కోరిక ఫలించలేదు..కొరటాల శివ వారి రేంజ్ లో ఉంటుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: