ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర‌వాత డ‌బుల్ స్పీడుతో సినిమాలు చేస్తున్నారు.ఇది వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏడాదికి ఒక‌టి లేదా రెండు సినిమాల‌తో స‌రిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే వ‌రుసపెట్టి సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా పెంచేశరని ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వ‌కీల్ సాబ్ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ 50 కోట్లు కాగా మ‌రో ప‌దిహేను కోట్లు లాభాల్లో వాటా కింద పుచ్చుకున్నార‌నేది టాక్. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సినిమాలకు కూడా రెమ్యున‌రేష‌న్ గ‌ట్టిగానే పుచ్చుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం వ‌ప‌న్ క‌ల్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పిరియాడిక‌ల్ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు ఏఎమ్ ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప‌వ‌న్ ఇప్ప‌టికే రూ.15 కోట్ల అడ్వాన్సు తీసుకున్నార‌ట‌. 

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ మ‌ల‌యాల సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రానా కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే రూ.22 కోట్లు అడ్వాన్స్ గా తీస‌కున్నార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ ను కూడా త‌న‌కే ఇచ్చేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒప్పందం చేసుకున్నార‌ని టాక్. మ‌రో వైపు ప‌వ‌న్ హ‌రీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాను మైత్రీమూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప‌వ‌న్ 30 కోట్ల రెమ్య‌న‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటాను కూడా తీసుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోయే సినిమాకు రూ.40 కోట్ల రెమ్యున‌రేష‌న్ తో పాటు లాభాల్లో వాటా పుచ్చుకుంటున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: