ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు..కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దేవాలయాల నేపథ్యంలో జరుగుతుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి మూడు ప్రాజెక్టు లైన్ లో పెట్టాడు.. వాటిలో రెండు రీమిక్స్ సినిమాలు కాగా మరొకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా.. రీమిక్స్ సినిమాలంటే మన తెలుగు హీరోలు కి ఎప్పటినుంచో మంచి మోజు ఉంది.. ఇతర భాషల నుంచి హిట్ అయిన సినిమాల్ని ఏరికోరి మరి రీమేక్ చేస్తూ ఉంటారు..
అలా చిరంజీవి తన కెరీర్లో కొన్ని రీమేక్ సినిమాలు చేయగా, వాటిలో ఎక్కువ నీ మేకులు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చేసి హిట్లు కొట్టాడు.. క్లాసిక్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రవిరాజా పినిశెట్టి తన కెరీర్లో ఎక్కువ సినిమాల్లో చిరంజీవితోనే చేయటం గమనార్హం.. ఇక సినిమాల విషయానికొస్తే చిరు తో ఆయన చేసిన మొట్టమొదటి రీమేక్ సినిమా జ్వాల.. చిరంజీవి కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా.. అలాగే చిరంజీవి నటించిన చక్రవర్తి, యముడికి మొగుడు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే..తెలుగు లో సూపర్ హిట్ సినిమా ఆయిన అంకుశం ప్రతిబంద్ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేశాడు చిరంజీవి.. దాని దర్శకుడు కూడా రవి రాజా పినిశెట్టి నే..రాజా విక్రమార్క , ఎస్పీ పరశురాం ఇవి కూడా వీరి కాంబోలో వచ్చిన సినిమాలే