మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో ఈ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయి.. ఆయనకు అభిమానులు ఎంత మంది ఉన్నారో చెప్పడం చాలా కష్టం.. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం చాలామంది హీరోలకు మోడల్ గా నిలిచారు.. రాజకీయాల్లోకి వెళ్లి చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమా తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, సైరా సినిమా ఆయన విజయాన్ని కొనసాగించింది.. ఈ రెండు సినిమాలతో తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని నిరూపించాడు..

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు..కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దేవాలయాల నేపథ్యంలో జరుగుతుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి మూడు ప్రాజెక్టు లైన్ లో పెట్టాడు.. వాటిలో రెండు రీమిక్స్ సినిమాలు కాగా మరొకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా.. రీమిక్స్ సినిమాలంటే మన తెలుగు హీరోలు కి ఎప్పటినుంచో మంచి మోజు ఉంది.. ఇతర భాషల నుంచి హిట్ అయిన సినిమాల్ని ఏరికోరి మరి రీమేక్ చేస్తూ ఉంటారు..

అలా చిరంజీవి తన కెరీర్లో కొన్ని రీమేక్ సినిమాలు చేయగా, వాటిలో ఎక్కువ నీ మేకులు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చేసి హిట్లు కొట్టాడు.. క్లాసిక్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రవిరాజా పినిశెట్టి తన కెరీర్లో ఎక్కువ సినిమాల్లో చిరంజీవితోనే చేయటం గమనార్హం.. ఇక సినిమాల విషయానికొస్తే చిరు తో ఆయన చేసిన మొట్టమొదటి రీమేక్ సినిమా జ్వాల.. చిరంజీవి కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా.. అలాగే చిరంజీవి నటించిన చక్రవర్తి, యముడికి మొగుడు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే..తెలుగు లో  సూపర్ హిట్ సినిమా ఆయిన అంకుశం ప్రతిబంద్ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేశాడు చిరంజీవి.. దాని దర్శకుడు కూడా రవి రాజా పినిశెట్టి నే..రాజా విక్రమార్క , ఎస్పీ పరశురాం ఇవి కూడా వీరి కాంబోలో వచ్చిన సినిమాలే

మరింత సమాచారం తెలుసుకోండి: