కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తారా స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న చరణ్ బాటలోనే మహేష్ ప్రభాస్ లు అడుగులు వేస్తున్నారు.  తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ ప్రభాస్ లు నటిస్తున్న మూవీ షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుని వారు తమ ఇళ్లకే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో నమ్రత షేర్ చేసియా ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో మహేష్ కు ఒక డ్రీమ్ హౌస్ ఉంది.   ఈ ఇంటి కోసం నమ్రత రెండేళ్ల పాటు ఇంటీరియర్ డిజైన్స్ పై రీసెర్చ్ చేసి మరీ చాల వైభవంగా కట్టించుకుంది అంటారు. ఈ ఇల్లు బయట నుంచి ఎంత సింపుల్ గా కనిపిస్తుందో ఇన్ సైడ్ అందుకు పూర్తి భిన్నంగా విజువల్ రిచ్ గా ఉంటుంది అంటారు. ఈ ఇంటి విలువ 28 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్.


ఇక లాక్ డౌన్ సీజన్ వచ్చిందంటే చాలు మహేష్ షూటింగ్ లకు వెళ్ళకుండా తన ఇంటిలోనే తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ తన ఇంటికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉండే సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ హౌస్ కు రోజు వెళ్ళడమే కాకుండా తిరిగి తన ఇంటికి తిరిగి వచ్చేడప్పుడు అదే రూట్ లో ఉండే తన సోదరి మంజుల ఇంటికి వెళ్ళి అక్కడ కొంత సమయం గడపడం మహేష్ కు ఎంతో ఇష్టమైన దినచర్య అట.


ప్రస్తుతం సెకండ్ వేవ్ తో షూటింగులకు బ్రేక్ ఇచ్చిన మహేష్ మళ్లీ ఫిలిం నగర్ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఖాళీ సమయం బాగా దొరకడంతో తన పిల్లలతో కాలం గడపడమే కాకుండా ప్రతిరోజుతన తండ్రి ఇంటికి వెళ్ళి వస్తున్నాడట. ఈవిషయాలను షేర్ చేస్తూ నమ్రత ``బ్యాక్ టు బేసిక్స్.. నాకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు.. గ్రేట్ ఫుల్ అండ్ బ్లెస్స్ డ్..`` అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు మహేష్ ఇంట్లో పెట్ డాగ్స్ తో తన పిల్లలు గౌతమ్ సితార ఆటలు ఆడుకుంటున్న ఫోటోని షేర్ చేసింది ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: