టీవీ రంగంలో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న యాంకర్లలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. ఈమె అందం, అభినయంతో కలగలసిన అందాల బొమ్మ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక అంతే కాకుండా ఈమె మాట చాతుర్యం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్యామలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత యాంకర్ గా పనిచేయడం మొదలు పెట్టింది.. ఈమె నటన దర్శకులను సైతం ఆకర్షించడంతో ఇక ఈమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి..
అలా.. లౌక్యం , ఒక లైలా కోసం, స్పీడున్నోడు వంటి సినిమాలలో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్యామల. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా ఈమె కంటెస్టెంట్ గా పాల్గొని , తన క్రేజ్ ను మరింత పెంచుతుంది.. ఇక ఈమె సీరియల్ కో ఆర్టిస్ట్ అయిన నరసింహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు ఫ్యామిలీతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ , టాప్ ప్లేస్ లో నిలబడింది శ్యామల.. శ్యామల సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఈమెకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఊరు కాకినాడ. కేవలం అవకాశాల కోసం మాత్రమే హైదరాబాద్ కు వచ్చింది..
అందరిలాగానే ఈమె కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ,ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంది. అవకాశాల కోసం ఈమె పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదట. అయితే ఇవన్నీ ఈమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాలను బయటపెట్టింది.. శ్యామల మాట్లాడుతూ .." సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. మాది హైదరాబాద్ కాదు . అవకాశాల కోసమే ఇక్కడికి వచ్చాను..
" కెరీర్ ప్రారంభంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా నటించాను . కానీ ఆ టైంలో నన్ను ఒక పేరున్న కెమెరామెన్ బాగా వేధింపులకు గురి చేసేవాడు . శారీరకంగా లొంగతీసుకోవాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ఇక అంతే కాకుండా అతను చెప్పినట్టు వినకపోతే నాకు అవకాశాలు రాకుండా చేస్తానని కూడా బెదిరించాడు. ఇక నేను ఈ విషయాలన్నింటినీ సీరియల్ దర్శకనిర్మాతలకు చెప్పాను. ఇక అప్పటినుండి నాకు వేధింపులు తక్కువయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది..