తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తెలుగు ఇండస్టీలో ఈ భామ అచ్చ తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందింది. తన అందం, అభినయం ఉన్న నటి. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ, సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినా చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కెరీర్ ను మలుపుతిప్పే బ్రేక్‌ కోసం ఈషా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉంది.

తెలుగులో ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఓ పాత్ర పోషించింది. ఆ సినిమా హిట్టయినా.. ఈషాకు ఒరిగిందేమీ లేదు. తాజాగా కరోనా రావడం.. సినిమాలు ఆగిపోవడంతోపాటు పెద్దగా సినీ అవకాశాలు లేకపోవడంతో ఇన్ స్టాగ్రామ్ లో సేదతీరుతోంది. టైట్ జీన్స్ వేసుకొని.. చిన్న టాప్ తో బ్లాక్ అండ్ బ్లాక్ లో ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈషారెబ్బ పోజులు ఇచ్చింది.

ఇక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. ఇంత అందాన్ని తెలుగు ఇండస్ట్రీ ఉపయోగించుకోవడం లేదని కామెంట్స్ వినపడుతున్నాయి. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఈషా రెబ్బ తమిళ్‌తో పాటు కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన తమిళ్‌లో ఓ సినిమా చేసింది.. ‘ఎస్‌ఆర్కే’ అనే మూవీతో కన్నడలో అరంగేట్రం చేసింది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ హిందీ వెబ్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో కూడా ఈషా నటించింది. ఇప్పటిదాకా హోమ్లీ క్యారెక్టర్స్‌కే మొగ్గు చూపిన ఆమె.. అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఆ వెబ్‌ సిరీస్‌ లలో నటిస్తూ అలరిస్తోంది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: