టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల కెరీర్ పరంగా ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు మూడు కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయి. దాని అనంతరం తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సెన్సేషనల్ మూవీ అఖండ. ఈ సినిమాలో బాలయ్య ఒక మధ్యతరగతి రైతుగా అలానే అఘోరాగా రెండు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన రెండు టీజర్లు కూడా సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని యువనిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కానుంది. ఇక దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మంచి మాస్ యాక్షన్ సినిమా చేయనున్నారు బాలయ్య. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.

అలానే దీని తర్వాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా బాలయ్య నటించనున్నారని ఇప్పటికే బాలయ్య కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించిన అనిల్, ప్రస్తుతం దాని యొక్క పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ మూడు మాత్రమే కాక వీటి అనంతరం బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా అలానే మరొక యువ దర్శకుడు తో మరో సినిమాని కూడా బాలయ్య చేయనున్నారని ఈ విధంగా యువకులకు సైతం తన కెరీర్ ప్లానింగ్ తో బాలయ్య షాక్ ఇస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమాలు బాలయ్యకు కెరీర్ పరంగా ఏ స్థాయి విజయాన్ని అందిస్తాయో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: