తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ మూవీతో నిర్మాతగా ప్రవేశించారు రాజు. వివి వినాయక్ దర్శకత్వంలో మంచి యూత్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. నేహ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. ఇక దాని తర్వాత నుంచి వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ ముందుకు కొనసాగిన దిల్ రాజు ఆపై కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయా సొంతం చేసుకుని గోల్డెన్ లెగ్ నిర్మాతగా మంచి పేరు గడించారు.

అయితే అనంతరం కొన్నాళ్లపాటు పలు పరాజయాలు కూడా చవిచూసిన దిల్ రాజు ఇటీవల మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఇటీవల మహేష్ బాబుతో మహర్షి, వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ఎఫ్2, అలాగే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ సొంతం చేసుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు దాదాపుగా అందరు స్టార్ హీరోలతో వర్క్ చేశారు. అయితే తాను కేవలం బాలకృష్ణ గారితో మాత్రమే పని చేయలేదని అతి త్వరలోనే ఆ కోరిక కూడా తీరనుందని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించారు రాజు.

ఇక లేటెస్ట్ గా పలు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే బాలయ్య కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం దాని స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఉన్నారని కాగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ రేంజ్ లో తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని చెబుతున్నారు. మరి ఇదే గనుక నిజమైతే తొలిసారిగా బాలయ్య దిల్ రాజు కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరో వైపు అనిల్ రావిపూడి కూడా తొలిసారిగా బాలయ్య తో పనిచేస్తుండటంతో దీనిపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఏర్పడడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: