కరోనా కారణంగా కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ అయితే రూ.4 వేల కోట్లు నస్టపోయిందని ఒక అంచనా. తమిళ ఇండస్ట్రీకి దాదాపు రూ వెయ్యి కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే దాదాపు రూ.1200 కోట్ల వరకు నష్టం వచ్చిందని సీనియర్‌ నిర్మాతలు చెబుతున్న మాట. కేవలం సమ్మర్‌ సీజన్‌లో టాలీవుడ్‌ దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్‌ జరుగుతుందని అంచనా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా 2020 వేసవి సీజన్‌ మొత్తం సినిమా థియేటర్లు మూతపడటంతో తెలుగు సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది.

ఇక 2021లోనూ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. సెకండ్‌వేవ్‌ కారణంగా మరోసారి థియేటర్లు మూత పడటంతో చాలా సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకుని కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సమ్మర్‌ సీజన్‌ పీక్స్‌లో ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ సారి కూడా లవ్‌ స్టోరీ, టాక్‌ జగదీష్‌, విరాట పర్వం, ఆచార్య, ఖిలాడి, అఖండ, రాధేశ్యామ్‌ ఇలా ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కానీ కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా మరోసారి థియేటర్లను మూసివేస్తూ తెలంగాణ థియేటర్ల యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమాలు అన్ని సమయానికి విడుదల అవుతాయనేది చెప్పలేకపోతున్నాయి దర్శక, నిర్మాతలు. ఒక వేళ సినిమా థియేటర్లు తెరుచుకున్నా.. ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ధైర్యం చేసి సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం లేదు.దీంతో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. అలాగని థియేటర్లలో తీసుకురావాల్సిన సినిమాలను డిజిటల్లో విడుదల చేయడం సరైన నిర్ణయం కాదంటున్నారు దర్శక, నిర్మాతలు. ఈ లెక్క ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు రూ.1200 కోట్ల వరకూ నష్టపోయినట్లు సమాచారం...!

మరింత సమాచారం తెలుసుకోండి: