కమల్ హాసన్ గారు క్రేజీ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారతీయుడు 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా 200 కోట్లతో నిర్మిస్తున్నారు .2.0 సినిమా తర్వాత  శంకర్ చేస్తున్న చిత్రం భారతీయుడు 2 అవ్వడంతో నిర్మాతలు ఖర్చు కి వెనుకడలేదు. చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు సినిమా కి ఇది సీక్వెల్ .అయితే అప్పట్లో విడుదలైన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .అప్పుడు ఇండియా అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు.

అయితే ఆ సినిమాకి సీక్వెల్ అంటే  అంచనాలు భారీగా పెరిగాయి . కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఈ మధ్య ఈ సినిమా నిర్మాతలు శంకర్ మీద కేస్ వెయ్యడం మళ్ళీ శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తానని ఒప్పుకోవడం లాంటివి జరిగాయి.అయితే ఈ మద్యనే కమెడియన్ వివేక్ మరణంతో శంకర్ కి ఇంకొక చిక్కు వచ్చి పడింది. అదేంటి అంటే భారతీయుడు 2 లో వివేక్ కి ఫుల్ లెంగ్త్ రోల్ ఉందంట. ఈ సినిమాలో ఆయన పాత్ర వరకు చాలా వరకు షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అదంతా రీషూట్ చెయ్యాలి అని అది ఇప్పట్లో జరగదు అని శంకర్ కోర్ట్ లో అన్నారని టాక్. అయితే ఈ విషయం మీద కోర్ట్ తీర్పు త్వరలోనే రాబోతుంది.

  ఇక ఈ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాను ప్రకటించారు .ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం అయ్యింది.  ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: