నటసింహ నందమూరి బాలక్రిష్ణ జూలు విదిల్చాల్సిందేనా. ఆయన జోరు పెంచాల్సిందేనా. అంటే అవును అంటున్నారు. లేకపోతే అనుకున్న టైమ్ లో టార్గెట్ ని రీచ్ కాలేమని అంటున్నారు. అయితే బయట చూస్తే మాత్రం సీన్ వేరుగా ఉంది.

కరోనా తీవ్ర రూపం దాల్చేసింది. అన్ని సినిమా షూటింగులు వరసబెట్టి మరీ  వాయిదా పడ్డాయి. అయితే అఖండ సినిమా మాత్రం ఇప్పటికే చాలా స్పీడ్ గానే షూటింగ్ జరుపుకుంది. అంటున్నారు. ఎక్కడా పెద్దగా అవుట్ డోర్ పెట్టుకోకుండా చాలా సినిమా పార్ట్ ని పూర్తి చేశారు. కొన్ని యాక్షన్ సీన్ల కోసం వికారాబాద్ అడవుల్లో కూడా షూటింగ్ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే మరో పది రోజుల షూటింగ్ మాత్రం అఖండకు మిగిలి ఉంది అంటున్నారు.

ఈ  మూవీని అనుకున్న ప్రకారం అంటే మే 28న నాటికి రిలీజ్ చేయాలి అంటే డే అండ్ నైట్ షూటింగ్ చేయాల్సిందే అన్న పరిస్థితి ఉందిట. అయితే బాలయ్య రెడీ కానీ మిగిలిన వారు కూడా తయారు కావాలి కదా. అదే సమయంలో కరోనా ఎఫెక్ట్ ని కూడా అంచనా వేసుకోవాలి కదా అన్నదే ఇపుడు చిత్ర యూనిట్ ముందున్న ప్రశ్న అంటున్నారు.

మొత్తానికి అఖండ టీజర్ ఈ మధ్య రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య బోయపాటి కాంబో  మీద కూడా ఒక రేజిలో అంచనాలు ఉన్నాయి. ఇటువంటి టైమ్ లోనే అనుకున సమయానికి బొమ్మ థియేటర్లలోకి తెస్తే ఆ ఊపే వేరుగా ఉంటుంది అంటున్నారు. అయితే మే నెల నాటికి కరోనా మరింతగా ఉధృతి చూపుతుంది అన్న అంచనాలు కూడా ఉన్న నేపధ్యంలో మే 28వ తేదీన  సినిమా రిలీజ్ అన్నది ఇప్పటికి అయితే డౌటే అంటున్నారు. మొత్తానికి బాలయ్య జోరు పెంచితే మాత్రం అఖండ మూవీ  కంప్లీట్ అయి ఆయన క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో కలసి కొత్త సినిమా సెట్స్ మీద కనిపించవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: