ఇటీవలే సింగర్ సునీత తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళిలో ఆమె పిల్లలే దగ్గరుండి అన్ని వ్యవహారాలను చూసుకున్నారు. రెండో పెళ్లి మాట పక్కన పెడితే పిల్లలు తన తల్లికి కొత్త జీవితాన్ని అందించాలని చూపించిన చొరవ అందరి మనసును తాకింది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో ఓ ప్రముఖ నటిని రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు ఆమె పిల్లలు. ఇంతకీ వాళ్ళు ఎవరు విషయమేమిటి అంటే... తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాలీవుడ్ నటి ఊర్వసి ధోలాకియా తన రెండో పెళ్లి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మనస్సుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని చెప్పుకొచ్చింది.

హిందీలో అటు బుల్లి తెర ఇటు వెండి తెర రెండిట్లోనూ తన సత్తా చాటుకున్న ఊర్వశి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు హిందీ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా ట్రోఫీని గెలుచుకున్నారు ఊర్వశి. కాగా చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగపిల్లలే...అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఆమె వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడి వివాదాలుగా మారాయి. దాంతో తన భర్తతో విడిపోయింది. చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని తనపై వేసుకుని ఒంటరిగానే తన ఇద్దరి కుమారులను పెంచి పెద్ద చేసింది. ఎప్పుడూ వారికి ఏ లోటు లేకుండా చూసుకుంది. ఇప్పుడు ఆమె కొడుకులు ఇద్దరు వారి వారి లైఫ్ లో సెటిల్ అయ్యారు.

వాళ్లిదరు కలసి తమ తల్లి ఊర్వశి ధోలాకియా వ్యక్తిగత జీవితం తిరిగి చిగురించాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు నటి ఊర్వశి. తన ఇద్దరు పిల్లలు తనని రెండో పెళ్లి చేసుకోవాలని బాగా ఒత్తిడి చేస్తున్నారని...అయితే ఇప్పటి వరకు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతికిన ఆమె ఇకపై కూడా ఎవరిమీద ఆధార పడకుండా తమ పిల్లల్ని చూసుకుంటూ ఎప్పటిలాగే జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఒకవేళ తన అభిరుచికి తగ్గ వ్యక్తి, తనను అర్ధం చేసుకునే వ్యక్తి కనుక ఎదురుపడితే తప్పక పెళ్ళికి అంగీకరిస్తానని చెప్పుకొచ్చారు నటి ఊర్వశి ధోలాకియా.

మరింత సమాచారం తెలుసుకోండి: