నాని హీరోగా విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. అప్పట్లో రిలీజ్ తరువాత మంచి విజయం అందుకున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు. అనంతరం మహానటి సినిమా ద్వారా మరొక విజయాన్ని సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దానితో మంచి పేరు దక్కించుకున్నారు. ఒకప్పటి దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఇక ఇటీవల నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించిన జాతి రత్నాలు సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నాగ అశ్విన్ దానితో కూడా విజయాన్ని అందుకున్నారు.

కాగా అనుదీప్ కె.వి ఈ మూవీ కి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక అతి త్వరలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా రూపొందనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాని తెరకెక్కించనున్నారు నాగ అశ్విన్. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తుండగా టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు టెక్నీషియన్స్ దీనికి పని చేయనున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో ప్రతిష్టాత్మకంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాని తీయనున్నారని టాక్.

అసలు విషయం ఏమిటంటే నేడు నాగ అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఆయన నుండి తమ హీరో సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని పలువురు ప్రభాస్ అభిమానులు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఇవాళ అశ్విన్ నుండి ఎటువంటి అప్డేట్ రావట్లేదని సమాచారం. ఇక అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని షూటింగ్ మొదలైన తర్వాత కొద్ది రోజుల అనంతరం ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్ బయటకు వస్తుందని యూనిట్ చెప్తున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: