భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో అతి పెద్ద స్థాయిలో విజయాన్ని అందుకొని మూవీపై అందరిలో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయనున్నారు మరోవైపు ప్రభాస్ తో ప్రస్తుతంతం సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. హోంబలె ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అసలు విషయం ఏమిటంటే దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయనున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఆయా సినిమాల నిర్మాతల తో ప్రశాంత్ నీల్ ఒప్పందం కుదరడంతో పాటు కొంతమేర అడ్వాన్స్ కూడా ఆయనకు ముట్టిందని టాలీవుడ్ వర్గాల టాక్.
అలానే ఈ రెండు సినిమాల కథలను ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తన బృందంతో కలిసి వీటి యొక్క పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారట. అయితే ఇక్కడ అసలు చిక్కేమిటంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలో ఏది ముందుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉందని, ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఎన్టీఆర్ చేయనున్నారని అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ తోనే తన నెక్స్ట్ సినిమా చేస్తారని కొందరు అంటుండగా, ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ అది పూర్తయిన తర్వాత ఐకాన్ సినిమా చేస్తారని దాని అనంతరం ప్రశాంత్ సినిమా ఉంటుందని మరికొందరు సినిమా వర్గాల వారు చెప్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ వీరిద్దరిలో తన తదుపరి సినిమా పక్కాగా ఎవరితో చేస్తారు అనే దానిపై క్లారిటీ రావడానికి మరొక ఆరు నెలల వరకు సమయం పడుతుందని ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారమట. మరి చూడాలి ప్రశాంత్ నీల్ వీరిద్దరిలో ఎవరితో తదుపరి సినిమా చేస్తారో ....!!